Karnatakaలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్బళ్లాపూర్ దగ్గర లారీ-జీపు ఢీ కొన్నాయి. ఈ
దుర్ఘటనలో జీపు నుజ్జునుజ్జయింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. లారీ-
జీపు ఢీ కొన్న ప్రదేశం హృదయ విదారకంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
రోదనలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి
చికిత్స అందిస్తున్నారు.చిక్కబళ్లాపుర్లోని చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్- బెంగలూరు జాతీయ
రహదారిపై మదికేరే క్రాస్వద్ద ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాసపుర్ తాలుకాలోని రాయల్పాడు గ్రామం
నుంచి జీపు చింతామనికి వైపునకు వస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
Comments
Post a Comment